నిజామాబాద్ జిల్లా కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంగల్ మంజీరా నది బ్రిడ్జి వద్ద సైకిల్ లిస్టును లారీ ఢీకొంది. మహారాష్ట్ర సాంఘిక గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వ్యక్తిని ఢీ కొట్టి లారీ డ్రైవర్ పరారయ్యే ప్రయత్నం చేశాడు. విషయాన్ని తెలుసుకున్న పోతంగల్ గ్రామస్తులు బస్టాండ్ దాటే సందర్భంలో లారీను పట్టుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.



