Friday, February 13, 2026

అభివృద్ధిలో శ్రామికులే భాగస్వాములు

ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.
కార్మికులందరికీ సముచిత గౌరవం లభిస్తుందన్నారు. నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కార్మిక లోకానికి సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు తెలిపారు.

శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని కొనియాడారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి తప్పకుండా దోహదపడుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి తెలంగాణ పునర్నిర్మాణానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ ముఖ్యమంత్రి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular