ధాన్యం కొనుగోలులో అవకతవకల పై రైతులు ఆందోళన ను వ్యక్తపరిచారు. బీబీపేట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద క్వింటాలుకు నాలుగు కిలోలు అదనంగా తీసుకున్న ధర్మ కాంట్ట వద్ద ఒక లారీ లోడు ధాన్యం కు సుమారు 11 నుంచి 12 క్వింటాళ్ల ధాన్యం తూకంలో తక్కువ చూపించడంతో రైతులు విషయం తెలుసుకొని ఆందోళన చేపట్టారు. సంబంధిత అధికారులు ధర్మ కంట ని పరిశీలించగా తూకంలో తేడా రావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మ కాంటాలో సాంకేతిక కారణాలవల్లనే తప్పు జరిగిందని ధర్మ కంట యాజమాని ఒప్పుకోవడంతో రైతులు ఆందోళన విరమించారు. ఇకముందు ఇటువంటి తప్పిదాలు జరిగితే ఉపేక్షించేది లేదని రైతులు హెచ్చరించారు.

