Friday, February 13, 2026

టిఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నార్ల రవీందర్.
మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన బాన్సువాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బాన్సువాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు.
నార్ల రవీందర్ నివాసంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పోచారం.నార్ల రవీందర్ అనుచరులు, కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జీ, మాజీ నిజాంబాద్ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి.
మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కామారెడ్డి జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు డి అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ ఎర్వల కృష్ణా రెడ్డి, బాన్సువాడ పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, రూరల్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, నాయకులు గురువినయ్‌, ఎజాజ్, నార్ల ఉదయ్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular