Friday, February 13, 2026

ఈనెల 5 న తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రచారం

14 పార్లమెంటు స్థానాలు దక్కించుకొని తీరాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వ్యూహరచనలు చేస్తున్నారు.

శాసనసభ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపొందడం అధికారంలోకి రావడం జరిగింది. ఆనాడు ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కొనసాగిన రేవంత్ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో తన సత్తాను చాటి చూపారు. ఢిల్లీ అధిష్టానం సైతం రేవంత్ రెడ్డి సత్తాను గుర్తించి ముఖ్యమంత్రి పీఠాన్ని అందించారు. ఆనాటి పరిస్థితులతో పోల్చుకుంటే నేటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో రాజకీయంగా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి పై వారి మంత్రివర్గంపై కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బలంగా నమ్ముతూ గంపెడాశలు పెట్టుకోంది. తెలంగాణ రాష్ట్రంలో 19 పార్లమెంటు స్థానాలు అనగా 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది తీరాలన్న దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పోరాటం చేస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టి తీరాలన్న దృఢ సంకల్పంతో రాహుల్ గాంధీ వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి తీరుతానని ఐదు గ్యారంటీ పథకాలను రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 14 పార్లమెంట్ స్థానాలు గెలుపొందితే కేంద్రంలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో ప్రాధాన్యం లభిస్తుందన్న ఆశల్లో తెలంగాణ కాంగ్రెస్ వాదులు ఆ ఆశాభావాన్ని చేస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏకైక లక్ష్యంగా భావిస్తూ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం తెలంగాణ పై ప్రత్యేక కన్ను వేశారు.

తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల రాజకీయం రస వత్తరంగా మారింది. అభ్యర్థులతో పాటు కీలక నేతల ప్రచారాలతో రాజకీయ కాక రేగుతోంది. ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు రంగంలోకి దిగడం తో విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రం వేడెక్కింది. ముఖ్యంగా జాతీయ పార్టీల నేతలు రాష్ట్రానికి వస్తుండటంతో ప్రచారం మరింత ఊపందుకుంది. ఇప్పటికే మోదీ, అమిత్ షా, నడ్డా బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి కూడా జాతీయ నేతలు రంగంలోకి దిగుతున్నారు.ఇందులో భాగంగానే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల రాష్ట్ర పర్యటన ఖరారైనట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 5వ తేదీన రాహుల్ గాంధీ నిర్మల్, గద్వాల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్ధు లకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారని తెలిపాయి. ఈ నెల 9వ తేదీన కరీంనగ ర్, సరూర్ నగర్, ప్రచారం చేయనున్నారు. ఈ నెల 6,7వ తేదీల్లో ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నా రు. 6వ తేదీన ఎల్లారెడ్డి, తాండూర్, సికింద్రాబాద్ ఎన్నికల ప్రచార సభలకు, 7వ తేదీన నర్సాపూర్, కూకట్పల్లిలో ప్రియాంక ప్రచారం చేయనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular