భక్తితోనే మోక్షం
శివ భక్తులు కట్టుబాట్లతో నడుచుకోవాలి
గ్రామాల్లో రైతులు, కూలీలు పాడిపంటలతో ఆనందంగా జీవనం గడపాలన్న దృడ సంకల్పంతో శివ భక్తులు పెద్ద ఎత్తున సప్తహ పూజా కార్యక్రమాలను చేపడుతారు. ఏడు రోజులపాటు ప్రత్యేక పూజలు, కీర్తనలు భజనలు, పారాయణం వినిపించి భక్తులకు అర్థమయ్యేలా భక్తి మార్గం గురించి వివరించారు. శివ భక్తులు కట్టుబాట్లతో నడుచుకొని శివుని అనుగ్రహం పొందవచ్చని దైవభక్తిపై మేధస్సు గల పండితులు సుంకిని సిద్ధి లింగప్ప మహారాజు భక్తులకు హితబోధ చేశారు. పాశ్చాత్య దేశ సంప్రదాయాలను విడనాడి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్ర కు చెందిన గాన కచేరి బృందం గానం ఆలపిస్తూ దైవంపై భక్తిని పెంపొందించే ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని చుట్టుప్రక్కల గ్రామాల వారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉమా రాంబాబు, రైతు నాయకులు అర్జున్, రాజు, మానప్ప, దుమాలె శివ, బస్వంత్,
