పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు ఐక్యంగా ఉండి సమిష్టి కృషి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆందోల్ నియోజకవర్గంలో అల్లాదుర్గ్ మరియు టెక్మల్ మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యం శాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షేట్కార్ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి అని తెలిపారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ , నారాయణాఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ,మాజీ మంత్రి చంద్రశేఖర్,మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కార్యకర్తలు సమిష్టి కృషి చేయాలి
RELATED ARTICLES
