బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమేర్ సతీమణి, ఆయేషా ట్రస్ట్ వ్యవస్థాపకులు అయేషా ఫాతిమా పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో ఉపాధి కూలీలతో మాట్లాడారు.
బోధన్ నియోజకవర్గంలోని ప్రజలకు ఏ ఆపద వచ్చిన తమ కుటుంబం అండగా ఉంటుందని, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని,పదేళ్లపాటు నియోజకవర్గం ప్రజలకు ఎంతో కృషి చేశామని, రాబోయే రోజుల్లోనూ ప్రజలకు తమ కుటుంబం అండదండలు అందిస్తుందని బోధన్ మాజీ ఎమ్మెల్యే సతీమణి ఐయేషా ఫాతిమా స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ సతీమణి అయోషా ఫాతిమా అమీర్ మరియు జడ్పి చైర్మెన్ దాదన్నగారి విఠల్ రావ్ అభ్యర్థి బాజిరెడ్డి ని పార్లమెంట్ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించాలని మోకన్ పల్లి మరియు నాడాపూర్ మరియు జన్నేపల్లి మరియు లింగాపూర్ గ్రామాల ఉపాధి హమీ కూలీలతో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పార్టీ అద్యక్షులు వి.నర్సింగ్ రావ్ మరియు సోసైటీ చైర్మెన్ అబ్బన్న ,తెడ్డు పోశేట్టి మరియు అల్లం రమేష్ మరియు నాగన్ పల్లి మధు, సోసైటి వైస్ చైర్మెన్ బాబర్ ,కృష్ణమోహన్ రావ్ గైని సతీష్,బండ్ర రాములు మరియు ఎంపిటీసి జనార్దన్ నాడాపూర్ మాజీ సర్పంచ్ రాజు ,అంజయ్య తుంగిని మాజీ సర్పంచ్ రవీంధర్ రావ్ ,మాజీ ఉపసర్పంచ్ రవింధర్ రావ్ మరియు టెకులింగం,శ్రీనివాస్ గౌడ్ మరియు శివకుమార్ ,జలందర్ టెకు పోశెట్టి,నిజాంపూర్ సాయిలు మరియు జనార్దన్ లు పాల్గొన్నారు.



