బోధన్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ముఖ్య సమావేశం నియిజకవర్గ అధ్యక్షులు ఫర్హాన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాద్యక్షులు, పార్లమెంట్ బాధ్యులు రామర్తి గోపి , జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి పాల్గొని యువజన కాంగ్రెస్ డోర్ టు డోర్ కార్యక్రమం గురించి చర్చించి, జీవన్ రెడ్డి గెలుపునకు యువజన కాంగ్రెస్ నాయకులు ప్రచారం లో వేగం పెచ్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంజయ్ , మండల అధ్యక్షులు అశోక్ ,కార్తీక్ , నవీన్ మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

