Monday, February 16, 2026

భావోద్వానికి లోనైనా మాజీ ముఖ్యమంత్రి.. గురువు కాళ్లు మొక్కిన కేసీఆర్

బస్సు యాత్రలో భాగంగా జగిత్యాలలో బస చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. స్థానికంగా నివాసం ఉంటున్న తన చిన్న నాటి గురువు ప్రముఖ కవి జైశెట్టి రమణయ్య వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.వయోభారంతో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న తన గురువును కేసీఆర్ పరామర్శించారు. తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సిద్దిపేట జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌గా.. చరిత్ర పాఠాలు నేర్పిన నాటి జ్ఞాపకాలను కేసీఆర్ నెమరు వేసుకున్నారు. తన ప్రియ శిష్యుణ్ణి చూసిన గురువు రమణయ్య ఎంతగానో మురిసిపోయారు. సిద్దిపేట జిల్లా కావాలని 30 ఏళ్ల కిందనే నాటి కేంద్ర మంత్రికి కేసీఆర్ వినతి పత్రాన్ని అందించిన విషయాన్ని గురువు రమణయ్య గుర్తు చేశారు. తనను పరామర్శించడానికి వచ్చిన శిష్యుడు కేసీఆర్‌తో పావుగంట పాటు ఇష్టాగోష్ఠి కొనసాగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular