నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి గా టి జీవన్ రెడ్డికి మద్దతుగా బోధ నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కౌన్సిలర్లు తుమ్ము శరత్ రెడ్డి, మోయిన్ పాషా ఆధ్వర్యంలో గడపగడప ప్రచారంలో భాగంగా వార్డు నెంబర్ నాలుగు నరసాపూర్ గ్రామములో ప్రచారం చేయడం జరిగింది. ప్రచారం ఆరు గ్యారెంటీలకు ఇస్తూ ఓటు వేయమని చెప్పడం జరిగిందని తెలిపారు.

ఈసారి భారీ మెజార్టీతో జీవన్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, కౌన్సిలర్ దాము, పావుల్, నజీర్, అలీ, సాయి కృష్ణ, షర్ఫుద్దీన్, సైద్ దిన్ దయాల్ నవీన్, మోహిత్ కలీం, సంతోష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
