బోధన్ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను నిజాంబాద్ ప్రిన్సిపల్ కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పోలింగ్ సామాగ్రి నిల్వ ఉంచిన విజయ మేరీ పాఠశాలను సందర్శించారు. పోలింగ్ సామాగ్రిని క్షుణ్ణంగా పరిశీలించి పార్లమెంటు ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఆయన వెంట ఆర్డిఓ రాజేశ్వర్, బోధన్ తాసిల్దార్, సిబ్బంది ఉన్నారు.



