Tuesday, February 17, 2026

రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్న పార్టీని తరిమికొట్టాలి

భూపాలపల్లి నియోజకవర్గం ఘనపూర్, చిట్యాల, టేకుమట్ల మండల కంద్రాలలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో *భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.

గండ్ర సత్యనారాయణ రావు పేరు నిలబెట్టాలి.భూపాలపల్లి నియోజకవర్గం నుండి లక్ష మెజారిటీ అందించాలనీ వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య కోరారు.సింగరేణి ని ప్రయివేటికరణ చేయాలని బీజేపీ చూస్తుంది.భూపాలపల్లి అభివృద్ధికి కృషి చేస్తా.ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తా.
పేద ప్రజల నిలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ,రాజ్యాంగాన్ని మార్చేస్తా, రిజర్వేషన్లు తీసివేస్తా అంటున్న బీజేపీనీ తరిమికొట్టాలి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చి రాహుల్ గాంధీ ని ప్రధాని చేసుకోవాలి.
నియోజకవర్గంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది…. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి.కాంగ్రెస్ పార్టీనీ కాదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాదని ఎవరు పనులు చేయగలరనీ కావ్య ప్రశ్నించారు
ఒక చేయి గెలిచింది… మరో చేయినీ గెలిపించాలి.
రెండు చెతులతో కొట్టె చప్పట్లకు మోడీ, అరూరి రమేష్ ల మైండ్ బ్లాక్ కావాలి.

మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించండి

మే 13న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.

బీజేపీ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదు. దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.
16వేల కోట్ల మిగులు రాష్ట్రాన్ని 2లక్షల కోట్ల అప్పులు కెసిఆర్ చేశారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆరోపించారు.మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది, 10లక్షల ఆరోగ్య శ్రీ, జీరో కరెంట్ బిల్లు అందించింది.ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో పని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ,దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ.మే 13న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారు.దేశంలో ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది.
ఘనపూర్ చెరువును రిజర్వాయర్ చేసి భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకు నీరు అందిస్తా అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
బీడీఎం 38, ఘనపూర్ చెరువుల అభివృద్ధికి 700కోట్లు మంజూరు ఇస్తా అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
మీరు నాకు అండగా నిలబడితే నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా.
అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. చేతకాని దద్దమ్మలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.మీ ఇబ్బందులు పరిష్కరిచేందుకు ఎల్లప్పుడూ మీ వేంటే ఉంటా.
అధికారులు అవినీతికి పాలడితే శంకరమాన్యలే గతి,
పార్లమెంట్ ఎన్నికలలో లక్ష మెజారిటీ అందిస్తే మనం ఏదీ అడిగితె అది మంజూరు ఇస్తా అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి.
మే 13న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ని మెజారిటీతో గెలిపించాలి.ఈ కార్యక్రమంలో దొమ్మటి సాంబయ్య, రామ్ నర్సింహా రెడ్డి,రాం నర్సింహా రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular