గోవూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
గోవూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు ఉప అధ్యక్షులు ఆధ్వర్యం లో గోవూర్ గ్రామ మాజీ సర్పంచ్ కుర్మే గంగారాం మరియు ఎన్నారై ఎండి లతీఫ్ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము కూడా పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి గౌరవ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించడం జరిగింది.
గోవుర్ లో పలువురు కాంగ్రెస్ లో చేరిక
RELATED ARTICLES
