ద్రోణ ఢిల్లీ బ్యూరో
రష్యాలో తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. 20 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పింది. వంతెనపై నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ నదిలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులందరినీ బస్సులోని ఎమర్జెన్సీ గేట్ ద్వారా బయటకు తీశారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
