కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు మృతి
హైదరాబాద్ బ్యూరో
భూపాలపల్లి జిల్లా:
భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కీర్తి భాయ్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రం నిమ్మగూడెం వైపు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కీర్తి బాయి అక్కడికక్కడే మృతిచెందగా ఆమె భర్త జాడి రాజయ్య కు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కీర్తి భాయ్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొంటూ విశేష సేవలు అందించేది అంటూ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూ రాలని ఆమె బంధుమిత్రు లు కోరుకుంటున్నారు.
