నిజాంబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉదయం 11 గంటల సమయానికి 28 శాతం పైగా ఓట్లు పోలయ్యాయి. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బార్లు తీరారు. వద్దులు సైతం పెద్ద ఎత్తున ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోధన్ పట్టణంలోనూ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిలబడ్డారు.















