ద్రోణ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి
14 మే 2024
ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
ఎమ్మెల్యే గండ్ర
గణపురం మండలం
అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఎలాంటి అధైర్యనికి గురి కావద్దని ధైర్యంగా ఉండాలని *భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు రైతులకు ధైర్యం ఇచ్చారు. గణపురం మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం రాత్రి కురిసిన అకాల వర్షంతో తడిసిన వడ్ల కొనుగోలు కేంద్రాలని మరియు నెలకొరిగిన పంటను పరిశీలించి రైతులకు ధైర్యాన్ని అందించిన శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు. వీరి వెంట మండల నాయకులు రైతులు అధికారులు తదితరులు ఉన్నారు.
