రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు తదితర ప్రముఖులతో కలిసి శాసనమండలికి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.ఖమ్మంలోని స్థంభాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయాన్ని శుక్రవారం ఉదయం సందర్శించి తమ గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు

,ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలు పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు పగడాల నాగరాజు, సీనియర్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం తదితరులు ఉన్నారు.
