ద్రోణ నిజామాబాద్ బ్యూరో
May 17, 2024,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం సాయంత్రం రెండు సర్పాలు (నాగుపాము) సయ్యాటలాడాయి. స్థానిక ఆలయానికి దర్శనం కోసం వచ్చిన భక్తులు సర్పాల సయ్యాటను వింతగా చేశారు. వేసవి ఎండ తీవ్రత నుండి వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని చల్లబడడంతో సర్పాలు అలా బయటకొచ్చి ఉపశమనం పొందుతూ సయ్యాటలు ఆడతాయని స్థానికులు తెలిపారు.
