ద్రోణ హైదరాబాద్ బ్యూరో
తాడ్వాయి అడవిలో జరిగిన అంగవ్ వాడీ టీచర్ హత్య కేసు చేదించిన పోలీసులు.
ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద మూడు తులాల బంగారం, టూవీలర్ స్వాదినం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నాంపల్లి అటవి ప్రాంతంలో అంగన్ వాడి టీచర్ రడం సుజాత (49) హత్య కేసులో నిందితులను ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన తాడ్వాయి సీఐ శంకర్, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి లు.
హత్యను చేదించిన వివరాలను ములుగు డీఎస్పీ రవింధర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
