Wednesday, February 18, 2026

బైక్ అదుపుతప్పి ముగ్గురు మృతి

సంగారెడ్డి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళుతూ ముగ్గురు మృతి చెందారు. బైక్ అతివేగంగా నడపడంతో అదుపుతప్పి బోల్తా కొట్టినట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రాంసాన్ పల్లి వద్ద 161 వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా మదునూరు మండలం పెద్దతడుగుర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో శ్రీనివాస్, సునీత, నగేష్ మృతి చెందారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular