Wednesday, February 18, 2026

బాధిత కుటుంబాలకు భీమా చెక్కులను అందజేసిన పోచారం

ఉమ్మడి నిజాంబాద్ బ్యూరో

ప్రమాధవశాత్తు మరణించిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన పార్టీ సభ్యత్వ బీమా చెక్కులను కుటుంబ సభ్యులకు మాజీ శాసన సభాపతి, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.
బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లం గ్రామానికి చెందిన జక్కా లక్ష్మణ్ చెక్కును భార్య జక్క కాశవ్వకు, పోతంగల్ మండలం హంగర్గ ఫారం కు చెందిన కాంబ్లై దిలీప్ కుమార్ కు చెందిన చెక్కును భార్య సమతా భాయికి, వర్ని మండలం హమ్నాపూర్ గ్రామానికి చెందిన సట్ట గంగమణి కి చెందిన చెక్కును ఆమె తల్లి సట్ట శివవ్వ కు అందించారు.బాన్సువాడ పట్టణంలోని పోచారం నివాసంలో జరిగి ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular