Thursday, February 19, 2026

కళ్యాణలక్ష్మి పథకానికి రూ.725 కోట్లు విడుదల

ద్రోణ హైదరాబాద్ బ్యూరో

హైదరాబాద్‌ బ్యూరో:మే 19
తెలంగాణ రాష్ట్రంలోని పేద వర్గాల వివాహా ఖర్చుల చెల్లింపుకు సంబంధించి రూపొందించిన కళ్యాణ లక్ష్మి పథకానికి ప్రభుత్వం రూ. 725 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షే మశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ. లక్ష నగదుతో పాటు తులం బంగారం కూడా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
గత ప్రభుత్వం కేవలం రూ. లక్ష నగదు మాత్రమే ఇచ్చేది. కానీ, నగదుకు అదనంగా తులం బంగారం కూడా అందజేస్తామని కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular