ద్రోణ హైదరాబాద్ బ్యూరో
పాలకుర్తి నియోజకవర్గం
తొర్రురు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భారత రత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక భారతానికి పునాదులు వేసి.. అణగారిన బతుకుల్లో వెలుగులు నింపి.. ఆఖరి క్షణం వరకు దేశం కోసమే బతికిన మహానేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు, మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ముఖ్యనాయకులు, యూత్ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.
