మన ఆచార సంప్రదాయాలను కాపాడుకోవాలి
ఎరకల నాంచారమ్మ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
ద్రోణ వరంగల్ బ్యూరో
వేంకటా పూర్ మండలంలోని రామంజా పూర్ గ్రామములో ఎరుకల నాంచారమ్మ ను దర్శించుకున్న రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన కట్టు బొట్టు మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఆచార సంప్రదాయాలను కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఎరుకల నాంచారమ్మ దీవెనలు ప్రజా ప్రభుత్వానికి ఉండాలని వచ్చే జాతర వరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ఆలయ అభివృద్ధి కృషి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
