ద్రోణ హైదరాబాద్ బ్యూరో
ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య
హాజీపూర్ మండలంలోని దొనబండకు చెందిన నరెడ్ల రాజ్ కుమార్ అనే యువకుడు శుక్రవారం రాత్రి గ్రామ శివారులోని పంట పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టాటాఏసీ ట్రాలీ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న మృతుడు కుటుంబ సభ్యులతో కలిసి మేడారానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కుటుంబసభ్యుల కన్నా ముందుగానే ఇంటికి చేరుకొని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
