ద్రోణ హైదరాబాద్ బ్యూరో
బాచుపల్లిలో భార్యను హత్య చేసి స్నేహితుడి ఇంటికి..!
బాచుపల్లిలో భార్యను భర్త పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే భార్యను హత్య చేసిన భరద్వాజ్ చందానగర్లోని స్నేహితుడు ఇంటికి వెళ్లాడు. తాను భార్యను హత్య చేశానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి భార్యను పొడిచిన కత్తితోనే పొడుచుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీనివాస్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స చేయించి రిమాండ్ కు తరలించారు.
