ద్రోణ బాన్సువాడ ప్రతినిధి





తెలంగాణ తిరుమల దేవస్థానం నందు శనివారం అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వేద పండితులు ప్రత్యేక మంత్రచారణతో ప్రత్యేక పూజలు సుధూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమా ల్లో వేద పండితులు భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు.ప్రతి శనివారం నిర్వహించే అన్నదానానికి అక్బర్ నగర్ వాస్తవ్యులు వినోద్ కుమార్ శైలజ దంపతులు మరియు హైదరాబాద్ వాస్తవ్యులైన కొడాలి ప్రసాద్ రావు సరూప రాణి దంపతులు 15 వేల రూపాయలు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు ఉప్పుల నమ్రిత చౌదరి కుటుంబ సభ్యులు 15 వేల రూపాయలు అన్నదానానికి విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు భోగవల్లి అప్పారావు నరసరాజు ఆలయ ప్రధాన అర్చకులు నందకిషోర్ వారిని శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
