ద్రోణ హైదరాబాద్ బ్యూరో
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కమాండ్ కంట్రోల్కు వచ్చిన ఆయనకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్లను సీఎం పరిశీలించారు.
అధికారుల విధుల గురించి తెలుసుకుని, వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నార్కోటిక్స్ బ్యూరోకు బడ్జెట్ కేటాయించిన నేపథ్యంలో దానిపై చర్చించారు.
