ఈరోజు సిపిఐ జిల్లా కార్యాలయంలో సురవరం.ప్రతాప్ రెడ్డి 128వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ ప్రముఖ కవి,రచయిత అమరజీవి సురవరం ప్రతాపరెడ్డి 1896 మే ఇరవై ఎనిమిది న మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాలపాడు లో జన్మించారు నిజాం నిరంకుశ పాలనలో తెలుగువారి అనుచివేతను నివసిస్తూ సురవరం ప్రతాపరెడ్డి ప్రజలను చైతన్య పరచడం కోసం తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేశారు.తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, పారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు గోల్కొండ పత్రిక దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలు స్థాపించి సంపాదకుడిగా పత్రిక రచయితగా ప్రసిద్ధి చెందారు. వనపర్తి శాసనసభ్యులుగా ప్రజలకు సేవలు అందించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కార్యదర్శి వై.ఓమయ్య,నాయకులు P.రంజిత్, రాధా కుమార్, ప్రకాష్, ఆనంద్ పాల్గొన్నారు.
సురవరం ప్రతాపరెడ్డి నూటా ఇరవై ఏనిమిది వ జయంతి-సిపిఐ
RELATED ARTICLES
