ద్రోణ హైదరాబాద్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆయన తల్లి సరోజినీ దేవి(98) ఆదివారం రాత్రి కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీలుగా మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు రాధాకిషన్రావుకు కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది.
