మళ్లీ మా అరవిందే ఎంపీ గా
ఇకపై బీజేపీ దే పై చెయ్
నిజామాబాద్ నగరం బిజెపినే
నిజామాబాద్ జిల్లాలోని రూరల్ గ్రామాలలో బిజెపి సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎంపీగా అరవింద్ రెండవ సారి రావడం కార్యకర్తలమైన మాకెంతో గర్వకారణం నిజామాబాద్ రూరల్ లోని తిర్మన్ పల్లి గ్రామంలో ప్రజలకు అరవింద్ మళ్లీ ఎంపీగా గెలిచి బిజెపికి ఉత్సాహాన్ని తీసుకురావడం బిజెపిలో కొత్తగా యువత ఆదర్శవంతంగా నిలబడడం మాకెంతో గర్వకారణంగా ఉందని మళ్లీ మాకు అరవింద్ ఎంపీగా రావడం.

నిజామాబాద్ జిల్లా లోని యువతకు, ప్రజలకు ఎంతో గర్వకారణంగా ఉందని చెబుతున్నామన్నారు. ఆయన హిందూ వాది గా ఉండడం ఎంతోమంది పేద పిల్లలకు సహాయం చేయడం ఆయన ఇచ్చిన హామీలలో చాలా వరకు పనులు చేశారని ప్రజలు ఆయన మీద పెట్టుకున్నా ఆశలు నెరవేరుస్తారని అందుకే ఆయనని మళ్లీ ఎంపీగా గెలిపించాలని ప్రజలందరికీ మా యొక్క అభినందనలు ఈరోజు మొత్తం జిల్లాలోని బిజెపి ర్యాలీ తీయడం అనేది మాకెంతో గర్వకారణంగా ఉందని ప్రతి గ్రామాలలో బిజెపి ఇప్పుడు ఇప్పుడే ప్రచారాలు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో మోడీ ప్రభుత్వం అయోధ్యలో రామాలయం నిర్మించడం ఎంతో గర్వకారణం దానికోసం ప్రజలు ఎన్నో సంవత్సరాలు కళ్ళు కాసేలా ఎదురు చూశారు. ఇన్ని సంవత్సరాలకు మన దేశ ప్రజల కల నెరవేరింది.

నిజామాబాద్ జిల్లాలో మన ఆర్మూర్ నియోజకవర్గంలో పసుపు బోర్డును తీసుకువచ్చారు. అలాగే బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపించడం బిజెపి ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ వల్లనే అవుతుందని దానివల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయని ఒకప్పుడు మన ఆసియా ఖండంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తారని కోరుతున్నాము. అదేవిధంగా సారంగపూర్ చెరుకు ఫ్యాక్టరీని కూడా సందర్శించి త్వరలోనే తెరిపిస్తే కొన్ని వేల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందని ఎంపీ అరవింద్ కి ఈ విషయం మీడియా తెలియజేయాలని కోరుతున్నాము.
