తెలుగు పత్రికా ప్రపంచంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి, తెలుగు ప్రజల మనోఫలకంపై తనదైన రాత రాసిన అక్షర యోధుడు, స్ఫూర్తిప్రదాత, మార్గదర్శి, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి చెందడం అత్యంత బాధాకరం.
ఎంతోమంది జర్నలిస్టులకు ఓనమాలు నేర్పించి ఇప్పుడు వారు వివిధ హోదాలలో స్థిరపడడానికి రామోజీరావు స్థాపించిన ఈనాడు ఈటీవి సంస్థలే కారణం.
పత్రికా టీవీ సినిమా తదితర రంగాలలో ఆయన సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగుజాతికి గర్వకారణం
తెలుగు జర్నలిజానికి వారు అందించిన సేవలు చిరస్మరణీయం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాము.
ఈనాడు గ్రూపు సంస్థల అధినేతరామోజీరావు కి బోధన్ ప్రింట్ మీడియా ఘన నివాళి
RELATED ARTICLES
