ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
పేకాట స్థావరంపై పోలీసుల దాడి… వ్యక్తి మృతి
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయగా తప్పించుకునే క్రమంలో ఓ వ్యక్తి మూడవ అంతస్థుపై నుంచి దూకడంతో మృతి చెందిన ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. లాలాపేటలోని శాంతినగర్ కు చెందిన వినయ్ కుమార్(35) గుట్టు చప్పుడు కాకుండా ఆడుతున్న పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. తప్పించుకునే క్రమంలో మూడంతస్తుల బిల్డింగ్ పైనుంచి వినయ్ దూకడం తో మృతి చెందాడు.
