బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని నేడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున శంషాబాద్ చేరుకుని స్వదేశానికి చేరుకున్న ఏనుగు రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. అమెరికాలో ఉన్న పరిస్థితులను ఆయన కాంగ్రెస్ నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నేమాని బుజ్జి, మేక వీర్రాజు, పుప్పాల శంకర్, బీమా సాయి రెడ్డి, బాబీ సెట్, నేమాని రఘు, నిఖిల్, మహేందర్, వినోద్, అభిషేక్, భారీ, కృష్ణారెడ్డి, గిరిజన రాష్ట్ర నాయకులు ప్రతాప్ సింగ్, తరుణ్, రాజు తో పాటు పలువురు పాల్గొన్నారు.

