తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి
ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ డా. కడియం కావ్య స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడి బాట స్వాగత దినోత్సవం కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య , జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందజేశారు.
బడి ఈడూ పిల్లలందరిని బడి బాట పట్టించాలి
ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి
ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నారు.
పాఠశాలలో మెరుగైన సౌకర్యాల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశాం.
