ద్రోణ కామారెడ్డి జూన్ 12
పిట్లం కు చెందిన ప్రతిభ, విజయ రాఘవేంద్ర రావు
చెస్, బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్ షిప్ విభాగాలలో బంగారు పతకాలు, వెండి పతకం సాధించారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ని కలిసి వారు సాధించిన పథకాలను చూపించారు.ఈ ఛాంపియన్ షిప్స్ లో పాల్గొనడానికి సహాయ సహకారాలు అందించినందుకు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేశారు.అడగగానే సహాయం చేసే మీలాంటి వ్యక్తి జుక్కల్ కు ఎమ్మెల్యే కావడం చాలా శుభ పరిణామం అని ఎమ్మెల్యే ని కొనియాడారు.
