ద్రోణ అమరావతి
ముఖ్యమంత్రిగా తన ఛాంబర్లో చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఫైళ్లపై సంతకాలు చేశారు.
మెగా డీఎస్సీపై తొలి సంతకం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం. పింఛన్ను రూ.4 వేలకు పెంచే దస్త్రంపై మూడో సంతకం. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం. స్కిల్ సెన్సెస్ పై ఐదో సంతకం చేసిన సీఎం చంద్రబాబు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మరియు కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ .
