ద్రోణ ఢిల్లీ
వివిధ రకాల వస్తువులపై జీఎస్టీ రేట్లు నిర్ణయించే
అధికారం కలిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జూన్ 22న జరగబోతోంది. ఆర్థిక మంత్రి
నిర్మలా సీతరామన్ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా 53వ కౌన్సిల్ సమావేశం జరగనుంది. వివిధ రాష్ట్రాలు/
కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొననున్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి
సమావేశం ఇదే. అక్టోబర్ 7న చివరి సమావేశం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తికాల బడ్జెట్ సమర్పణకు ముందు ఈ భేటీ
జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చిస్తారనేది ఇంకా తెలియరాలేదు.
