Saturday, February 21, 2026

22న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

ద్రోణ ఢిల్లీ

వివిధ రకాల వస్తువులపై జీఎస్టీ రేట్లు నిర్ణయించే
అధికారం కలిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జూన్ 22న జరగబోతోంది. ఆర్థిక మంత్రి
నిర్మలా సీతరామన్ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా 53వ కౌన్సిల్ సమావేశం జరగనుంది. వివిధ రాష్ట్రాలు/
కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొననున్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి
సమావేశం ఇదే. అక్టోబర్ 7న చివరి సమావేశం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తికాల బడ్జెట్ సమర్పణకు ముందు ఈ భేటీ
జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చిస్తారనేది ఇంకా తెలియరాలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular