
ద్రోణ మహబూబాబాద్
మహబాబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై తెల్లవారుజామున బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై మహబూబాబాద్ నుండి నర్సంపేటకు వెళ్తున్న వెదురు బొంగుల లారీ ఒక్కసారి గా అదుపుతప్పి బీభత్సం సృష్టించి ప్రయాణికుల మీద పడగా అక్కడికక్కడే పాపారావు CI గన్ మెన్, దేవందర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు చనిపోయారు.

బోల్తా పడ్డ లారీని లేపడానికి స్థానిక పోలీసులు మరియు బాటసారులు నానా అవస్థలు పడ్డారు వీరు ఇద్దరు కూడా కొద్దిసేపట్లో విధుల్లోకి హాజరయ్యే లోపే ఒక్కసారిగా మృత్యువాత పడడంతో ఒక్కసారిగా గూడూరు మొత్తం ఒక్కసారిగా శోకసముద్రం అలుముకున్నాయి. మృతదేహాలను వెలికి తీసిన అనంతరం గూడూరు మార్చరి కీ తరలించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం తోనే ప్రమాదనికి కారణం ఐ ఉండొచ్చని స్థానికులు చర్చించు కుంటున్నారు.
