ద్రోణ కామారెడ్డి ప్రతినిధి


ఎల్లారెడ్డి మున్సిపల్ పరిథిలో గల ప్రభుత్వ ఆసుపత్రిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆకస్మిక తనిఖీ చేశారు.తనిఖీలో భాగంగా ఒపి రిజిస్టర్ ని పర్శిలించి అనంతరం ఆసుపత్రి సిబ్బంది, సూపర్డెంట్ తో రివ్యు నిర్వహించారు. చికిత్స పొందుతున్న ప్రజలతో ఆసుపత్రిలో గల సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన చికిత్స అందించాలని డాక్టర్లకు ఎమ్మెల్యే మదన్ మోహన్ సూచించారు.
