ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి Jun 20
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపం రైలు లో మంటలు చెలరేగాయి. ఆలుగడ్డ బావి వద్ద స్పేర్ కోచ్ల్లో మంటలు ఎగిసిపడగా.. కోచ్లో ఎవరూ లేకపోవడంలో పెను ప్రమాదం తప్పింది. రెండు ఏసీ బోగీల్లో భారీగా మంటలు, పొగలు వ్యాపించడంతో ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు.
