నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ప్రజలు హోటళ్లు, రెస్టారెంటులు, గేమింగ్ జోన్ లు, ఆమ్యూజ్మెంట్ పార్కులు మరియు ఎస్టాబ్లిస్మెన్ట్ లు సంబందిత శాఖలనుండి ఎలాంటి అనుమతి (పర్మీషన్) లేకుండా కొందరు నడిపిస్తున్నారు. అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హెచ్చరించారు.
పబ్లిక్ భద్రత కి కావలసిన నియమనిబంధనలు పాటించకుండా నడిపిస్తున్నారు.ఎవరైన సంబందిత శాఖల నుండి భద్రతకు సంబంధించి అనుమతి తీసుకోకుంటే ఇప్పటి నుండి పోలీస్ వారు మరియు సంబంధిత శాఖల వాళ్లతో కలిసి దాడులు నిర్వహించి చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్, ఐ.పి.యస్ జిల్లాలోని అన్ని డివిజన్ స్థాయి అధికారులకు సర్కిల్ ఇన్స్పెక్టర్లకు ,ఎస్.హెచ్.ఓ, లకు, ఎస్.ఐలకు ఆదేశాలు జారీ చేశారు.
అనుమతులు లేకపోతే కేసులు నమోదు చేస్తాం
RELATED ARTICLES
