ద్రోణ న్యూఢిల్లీ ప్రతినిధి
అయోధ్యలో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి టాటా సన్స్ చేసిన ప్రతిపాదనకు యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ అంగీకారం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాలను ఇక్కడ తీర్చిదిద్దనున్నారు.
