ద్రోణ అమరావతి ప్రతినిధి
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఫొటోతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం
నిర్ణయించింది. పంపిణీ చేసిన 20.19 లక్షల భూహక్కు పత్రాలు, పంచాల్సిన మరో లక్ష పత్రాలను నిలిపివేశారు. దీనిపై అధికారులతో మంత్రి సత్యప్రసాద్ చర్చించారు. అందరికీ కలిపి కొత్త పాస్ పుస్తకాలివ్వాలని
నిర్ణయించారు. రాజ ముద్రతో కొత్త పుస్తకాల డిజైన్లను తయారు చేసి, సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత పంపిణీ పై నిర్ణయం తీసుకోనున్నారు.
