దేశంలో జికా వైరస్ కలకలం రేపింది.
ద్రోణ న్యూఢిల్లీ ప్రతినిధి
మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ వైద్యుడికి జ్వరం, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించాయి.
దీంతో ఆయన బ్లడ్ శాంపిల్స్ను పరీక్షించగా
జికా వైరల్ పాజిటివ్గా తేలినట్టు వైద్యులు వెల్లడించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా.ఆయన 15ఏళ్ల కుమార్తెకు కూడా పాజిటివ్ వచ్చింది.అయితే వీరిద్దరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
