చేవెళ్ల గులాబి ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి సమక్షంలో కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
