ద్రోణ వరంగల్ ప్రతినిధి
హన్మకొండ జిల్లా పర్యటనలో భాగంగా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ పరిశీలనకు వచ్చిన తెలంగాణ పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి . ఈ సందర్బంగా టెక్స్ టైల్ పార్క్ ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య , ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ మల్టి స్పెషలిటీ ఆపత్రి నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
