ద్రోణ బోధన్, జూన్ 29
బోధన్ డిపోలో విధులు నిర్వహించి శనివారం పదవి విరమణ చెందిన ఎస్డీఐ ఎండీఎస్ రహమాన్, ఎడిసి యండీ అలీముద్దీన్ లను బోధన్ డిపో మేనేజర్ శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, పదవి విరమణ ప్రతి ఒక్కరికి సహజమైనప్పటికీ అధికారులు తమ పదవి కాలంలో ప్రజలకు చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆర్టీసీ అనేది ప్రజలతో మమేకమైన సంస్థ అని అందువల్ల ఈ సంస్థలో పనిచేసే ప్రతీ ఒక్కరు ప్రజల మమకారం చూరగొనాలని ఆయన కోరారు. కాగా పదవీ విరమణ చెందిన అధికారులు తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా గడపాలని డిఎం శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బోధన్ డిపో ఎంఎఫ్ హరిప్రసాద్ గౌడ్, ఎస్టీఐ లక్ష్మణ్, సృజన, టైర్ ఎడీసీ బిఎ రాణి తో పాటు ఎడీసీలు, ఆర్టీసీ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.
